పున్నమి సెప్టెంబర్ 11 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఈ కళాశాల ఆవరణలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కళాశాల ఆఫీస్లోని అల్మారాను బద్దలు కొట్టి లోపల ఉంచిన భారీ నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఘటన బయటపడడంతో కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్టమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కోటి రూపాయల నగదు కళాశాలలో ఎందుకు ఉంచారనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన.. భారీ దొంగతనం వెలుగులోకి
పున్నమి సెప్టెంబర్ 11 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఈ కళాశాల ఆవరణలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కళాశాల ఆఫీస్లోని అల్మారాను బద్దలు కొట్టి లోపల ఉంచిన భారీ నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఘటన బయటపడడంతో కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్టమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కోటి రూపాయల నగదు కళాశాలలో ఎందుకు ఉంచారనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

