నవంబర్ 1వ తేదీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భం గా, నందిగామలోని స్థానిక వాసవి బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. సంఘం నేత పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు చెప్పబడ్డాయి.
ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ, పెనుగొండను “వాసవి పెనుగొండ”గా నామకరణం చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి సవిత, కూటమి ప్రభుత్వం ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సత్య కుమార్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల అభీష్టం మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటానికి రాష్ట్రఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పారేపల్లి సాయిబాబు, పబ్బతి జనార్దన రావు, సముద్రాల ఈశ్వరయ్య, పులిపాటి వెంకటేశ్వరరావు, అడ్డగిరి కృష్ణమూర్తి, కుంచం విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం – నందిగామ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘన నివాళి
నవంబర్ 1వ తేదీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భం గా, నందిగామలోని స్థానిక వాసవి బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. సంఘం నేత పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు చెప్పబడ్డాయి. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ, పెనుగొండను “వాసవి పెనుగొండ”గా నామకరణం చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి సవిత, కూటమి ప్రభుత్వం ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సత్య కుమార్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల అభీష్టం మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటానికి రాష్ట్రఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పారేపల్లి సాయిబాబు, పబ్బతి జనార్దన రావు, సముద్రాల ఈశ్వరయ్య, పులిపాటి వెంకటేశ్వరరావు, అడ్డగిరి కృష్ణమూర్తి, కుంచం విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

