చాట్రాయి అక్టోబర్ 4 (ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) శ్రమ జీవులకు గౌరవమిస్తూ, స్వావలంబనకు ప్రోత్సాహాన్నిస్తూ “ఆటోడ్రైవర్ల సేవలో” పథకం ద్వారా ప్రతిఒక్క ఆటో, మాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15000-00 లు వారి బ్యాంకు ఖాతాలో కూటమి ప్రభుత్వం జమచేయడం శ్రమజీవుల సంక్షేమం పట్ల చంద్ర బాబు చిత్తశుద్ధికి నిదర్శనం అని చనుబండ సొసైటీ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు. శనివారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం గ్రామం నుండి మోరంపూడి శ్రీనివాస రావు, నక్కా రాము ఆధ్వర్యంలో ఆటోలను తీసుకుని మంత్రి కొలుసు పార్థసారథి సారథ్యంలో నూజివీడు లో జరుగు ఆటో ర్యాలీ, బహిరంగ సభకు వెళ్ళడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇవ్వనప్పటికీ చంద్ర బాబు ఆటో డ్రైవర్లకు డబ్బులు వేయడం గొప్ప విషయం అని మోరంపూడి అన్నారు. నక్కారాము మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరూ కూటమి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత తో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమళ్ళ బ్రహ్మయ్య, కందుల శివయ్య, మునగంటి శ్రీను, మేడా వెంకటేశ్వర రావు, మాటూరి పాపారావు, మాటూరి వెంకటేశ్వర రావు, భూబత్తుల చెన్నారావు, ఆటో డ్రైవర్ లు కందుల నాగేశ్వర రావు, చీపు చెన్నారావు, దార్ల మన్మథ రావు, మేడా వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ లకు డబ్బులు శ్రమజీవుల సంక్షేమం పట్ల చంద్ర బాబు చిత్తశుద్ధికి నిదర్శనం సొసైటీ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
చాట్రాయి అక్టోబర్ 4 (ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) శ్రమ జీవులకు గౌరవమిస్తూ, స్వావలంబనకు ప్రోత్సాహాన్నిస్తూ “ఆటోడ్రైవర్ల సేవలో” పథకం ద్వారా ప్రతిఒక్క ఆటో, మాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15000-00 లు వారి బ్యాంకు ఖాతాలో కూటమి ప్రభుత్వం జమచేయడం శ్రమజీవుల సంక్షేమం పట్ల చంద్ర బాబు చిత్తశుద్ధికి నిదర్శనం అని చనుబండ సొసైటీ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు. శనివారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం గ్రామం నుండి మోరంపూడి శ్రీనివాస రావు, నక్కా రాము ఆధ్వర్యంలో ఆటోలను తీసుకుని మంత్రి కొలుసు పార్థసారథి సారథ్యంలో నూజివీడు లో జరుగు ఆటో ర్యాలీ, బహిరంగ సభకు వెళ్ళడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇవ్వనప్పటికీ చంద్ర బాబు ఆటో డ్రైవర్లకు డబ్బులు వేయడం గొప్ప విషయం అని మోరంపూడి అన్నారు. నక్కారాము మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరూ కూటమి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత తో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమళ్ళ బ్రహ్మయ్య, కందుల శివయ్య, మునగంటి శ్రీను, మేడా వెంకటేశ్వర రావు, మాటూరి పాపారావు, మాటూరి వెంకటేశ్వర రావు, భూబత్తుల చెన్నారావు, ఆటో డ్రైవర్ లు కందుల నాగేశ్వర రావు, చీపు చెన్నారావు, దార్ల మన్మథ రావు, మేడా వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

