
అవకాశాలను అందిపుచ్చు కోవాలి ‘యువత ముందున్న అవకాశాలను అందిపుచ్చు కోవాలని’డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వావిద్యాలయం ఉపకులపతి డా. రజని అన్నారు. గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల లో గురజాడ విద్యా సంస్థలు, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్తoగా నిర్వహించిన యువ కవితా మహోత్చవం లో ఆమె ముఖ్య అతిధి గా పాల్గొని ‘దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. యువత మేధను మనదేశ అభివృద్ధికి దోహదపడాలని, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుచొబెట్టే బాధ్యత యువతదేన’ని అన్నారు.విద్యా సంస్థ ల అధినేత జి. వి. స్వామి నాయుడు విద్యార్థులు తమ సమయం లో కొంత బాగాన్ని కళలు కోసం కేటాయించుకోవాలన్నారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి. బాలాజీ,’విద్యార్థులు తరగతి నాలుగు గోడల మధ్య నుంచి భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని’కోరారు.విశ్వ సాహితీ కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కె. రమావతి ‘యువత కు నాటి, నేటి సాహిత్యం ను పరిచయం చేసి, వారితో రచనలు చేయించి వాటిని విశ్వ వేదికలపైన పరిచయం చేయాలనే తళంపుతో సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన సమావేశం లో గజల్ శ్రీనివాస్ పాల్గొని తన ప్రసంగం తో, పాటతో యువత కు స్ఫూర్తినిచ్చారు.ఈ కార్యక్రమం లో జంద్యాల శరత్ బాబు, గౌరిశంకర్, ఈ వేమన, ముకుందరావు, తదితరులు పాల్గొన్నారు.

