కార్తిక మాసం, వారాంతం కావడంతో అరకులోయ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో గిరిజన మ్యూజియం కళకళలాడింది. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. శనివారం మ్యూజియంను 2174 మంది పర్యాటకులు సందర్శించడంతో సుమారు రూ. 1,35,000/- ఆదాయం వచ్చినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు.

అరకు: పర్యాటకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం
కార్తిక మాసం, వారాంతం కావడంతో అరకులోయ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో గిరిజన మ్యూజియం కళకళలాడింది. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. శనివారం మ్యూజియంను 2174 మంది పర్యాటకులు సందర్శించడంతో సుమారు రూ. 1,35,000/- ఆదాయం వచ్చినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు.

