

జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట డివిజన్ లొ జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా షేక్ పేట డివిజన్ పరిధిలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు.సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ, చేగుంట,అక్బర్ పేట-భూంపల్లి మండలల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర లో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం చేసారు.
ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను.. సంక్షేమ పథకాలను వివరించారు..
చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ..“ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే. అభివృద్ధి, సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీ తో గెలుపించాలని కోరారు….
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట-భూంపల్లి, చేగుంట మండలల నాయకులు..కార్యకర్తలు.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు..

