Tuesday, 7 April 2026
  • Home  
  • అపరిశుభ్రంగా ఆయిల్ ప్యాకింగ్-మిల్లు నిర్వాహకులకు అధికారుల హెచ్చరిక
- తిరుపతి

అపరిశుభ్రంగా ఆయిల్ ప్యాకింగ్-మిల్లు నిర్వాహకులకు అధికారుల హెచ్చరిక

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏ.ఎం. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక ఆయిల్ మిల్లుపై మంగళవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్.డి. శ్రీధర్ కుమారుడు ఆర్.డి. యోగానంద్ నిర్వహిస్తున్న ఈ మిల్లులో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కనీస శుచి, శుభ్రత లేని అపరిశుభ్ర వాతావరణంలో ఆయిల్ ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ మిల్లు నిర్వహణకు మునిసిపాలిటీ నుండి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ గాని, భవన నిర్మాణ అనుమతులు గాని లేవని తనిఖీల్లో తేలింది. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పామాయిల్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి, అపరిశుభ్ర వాతావరణంలో మిల్లు నడుపుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్సులు లేని వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏ.ఎం. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక ఆయిల్ మిల్లుపై మంగళవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్.డి. శ్రీధర్ కుమారుడు ఆర్.డి. యోగానంద్ నిర్వహిస్తున్న ఈ మిల్లులో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కనీస శుచి, శుభ్రత లేని అపరిశుభ్ర వాతావరణంలో ఆయిల్ ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ మిల్లు నిర్వహణకు మునిసిపాలిటీ నుండి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ గాని, భవన నిర్మాణ అనుమతులు గాని లేవని తనిఖీల్లో తేలింది. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పామాయిల్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి, అపరిశుభ్ర వాతావరణంలో మిల్లు నడుపుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్సులు లేని వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.