
చోడవరం పాత బస్టాండ్లో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాల మూడవ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు.
వివిధ రకాల పండ్లతో అలంకరణ చేసి, ఉదయం నుండి శ్రీ సూక్త సహిత సహస్ర కుంకుమార్చన, పంచామృత అభిషేకం, అన్నపూర్ణాదేవి హోమం నిర్వహించబడింది అని ఆలయ అర్చకులు శివకుమార్ శర్మ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను మోటార్ వర్కర్స్ యూనియన్ ఉత్సవ కమిటీ చూసుకుంది.
మండలం ప్రాంతంలోని దామునాపల్లి, మైచర్లపాలెం, లక్ష్మీపురం, వెంకన్నపాలెం సాయిబాబా గుడి పక్కన దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లోనూ, ఇతర గ్రామాల్లోనూ భక్తులు శ్రీ సూక్త విధానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారని గ్రామ పెద్దలు తెలిపారు.

