ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 29 మార్చి (పున్నమి ప్రతినిధి ) .మనుబోలు మండలంలోని అక్కంపేటగ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామమంతా పసుపు జెండాలతో కళకళలాడగా, పొన్నూరు రామకృష్ణయ్య, షేక్ అమీర్ భాష, ఇనుమడుగు పెంచల్ రెడ్డి తదితర నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘనంగా ఘటించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అక్కంపేటలో తెలుగుదేశం పార్టీ44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 29 మార్చి (పున్నమి ప్రతినిధి ) .మనుబోలు మండలంలోని అక్కంపేటగ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామమంతా పసుపు జెండాలతో కళకళలాడగా, పొన్నూరు రామకృష్ణయ్య, షేక్ అమీర్ భాష, ఇనుమడుగు పెంచల్ రెడ్డి తదితర నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘనంగా ఘటించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

