సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డు రఘువీర రెడ్డి కాలనీ వద్ద నిర్మించి శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు తీర్చి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం పూజాది కార్యక్రమాలు అనంతరం కృష్ణ కొలువు వేదిక మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ నుండి జౌళి వీధి మీదుగా బజారు వీధి,ఎద్దుల సంత వీధి రంగబాబు సర్కిల్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ మీదుగా తిరిగి మదనపల్లి రోడ్ లో శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు వేదిక వద్దకు అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది… జయ కృష్ణ నినాదాల తో, భగవద్గీత శ్లోక ఉచ్చారణ లతో భక్తులు పరవశించి ఊరేగింపు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, వింధ్య, హేమంత్ , రెడ్డెమ్మ, రేఖ కళ్యాణి, గౌతమ్, హరిబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగినది.వి కోట అశోక్ బాబు, బంగారు పాళ్యం రేణుక దేవి, వాణీశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు
సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డు రఘువీర రెడ్డి కాలనీ వద్ద నిర్మించి శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు తీర్చి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం పూజాది కార్యక్రమాలు అనంతరం కృష్ణ కొలువు వేదిక మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ నుండి జౌళి వీధి మీదుగా బజారు వీధి,ఎద్దుల సంత వీధి రంగబాబు సర్కిల్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ మీదుగా తిరిగి మదనపల్లి రోడ్ లో శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు వేదిక వద్దకు అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది… జయ కృష్ణ నినాదాల తో, భగవద్గీత శ్లోక ఉచ్చారణ లతో భక్తులు పరవశించి ఊరేగింపు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, వింధ్య, హేమంత్ , రెడ్డెమ్మ, రేఖ కళ్యాణి, గౌతమ్, హరిబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగినది.వి కోట అశోక్ బాబు, బంగారు పాళ్యం రేణుక దేవి, వాణీశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

