Wednesday, 25 March 2026

Tag: Yadadri Bhavanagiri

తెలంగాణ యాదాద్రి భువనగిరి

జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక

*జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక* హైదరాబాద్, జులై 23, పున్నమి ప్రతినిధి: చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం జాతీయ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 24 మందికి జాతీయ అవార్డులు వరించాయి. మొత్తం 24 అవార్డుల్లో 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులున్నాయి. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు చేనేతలు గూడ పవన్, గజం నర్మద ఎంపిక అయ్యారు. వీరికి ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే వీరిద్దరి స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం కావడం గమనార్హం. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కేంద్ర అవార్డుకు ఎంపిక కావడం పట్ల పుట్టపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత అవార్డులు-2024కు ఎంపికైన ఇరువురికి తెలంగాణ రాష్ట్రంలోని పలు చేనేత సంఘాలు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.