Monday, 30 March 2026

Tag: Telangana News

తెలంగాణ

టీఎస్ పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా శాఖ కు రిలీఫ్ ఫండ్ కు విరాళం

కామారెడ్డి, 22 సెప్టెంబర్,పున్నమి ప్రతినిధి   : ఊహించని వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు సహాయం చేయడానికి,  తెలంగాణ పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ముందుకు వచ్చింది. వరద సహాయ నిధి కోసం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు  (ఏడు లక్షల ఆరు వేల పదకొండు రూపాయ లు) విలువైన డీడీని ఈ రోజు కలెక్టరేట్‌లో అందజే శారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, తెలంగాణ పిఆర్టి సంఘ సభ్యులు, జిల్లా బాధ్యుల ను అభినందించారు. ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మీరు ఇతర సంఘాలకు ఆద ర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి సామా జిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి జిల్లా అభి వృద్ధికి తోడ్పడాలని సూచించారు. పీటిఆర్టి యు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ, తమ సంఘం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారా నికే కాకుండా, సామాజిక కార్యక్రమాలలో  ముందుంటుందని చెప్పారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముఖ్యంగా 39 పాఠశాలలను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించడం, రెడ్ క్రాస్ సౌజన్యంతో 6 సార్లు రక్తదా న శిబిరాలు నిర్వహించి 900కు పైగా బ్లడ్ యూని ట్లు సేకరించడం, కరోనా సమయంలో 22 రోజుల పాటు నిరంతరాయంగా 200 మందికి అన్నదానం చేయడం, ప్రతి మండల శాఖ పేదలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల ను వివరించారు.ఈ కార్యక్రమాలకు సహకరించిన  ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘ అధ్యక్షు లు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీష్మ గౌడ్, పెద్దలు బి. మోహన్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ లకు ధన్యవా దాలు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని మండలా ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, బాధ్యులకు, ప్రాథమిక సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోడీఈఓ రాజు, టి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు జే. మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, గోవర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మండ్లు, రమణ, రామచం ద్ర రెడ్డి, ప్రసాద్, సంతోష్ లతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు పాల్గొన్నారు.

Blog E-పేపర్ తెలంగాణ నిర్మల్ విద్య విజ్ఞానం

క్రీడా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వండి..

నిర్మల్ జిల్లా 26ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈనెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ వరకు వెళ్లి మళ్లీ తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీగా వచ్చే కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ క్రీడాకారులు పీడి/పీఈటీలు ఉత్సాహవంతులు ర్యాలీలో పాల్గొనాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత సంవత్సరం సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం సైతం ఉంటుందని తెలిపారు.

E-పేపర్ ఆదిలాబాదు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తెలంగాణ నిర్మల్

అక్రమ సంబంధం.. కట్ చేస్తే..!! ఏం జరిగిందో తెలిస్తే షాక్..!

నిర్మల్ జిల్లా 26-ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) (గైని భోజన్న):- వేదమంత్రాల సాక్షిగా ఏడు అడుగులు వేసి కలకాలం ఒకరికొకరు తోడుంటామని చెప్పి పెళ్లితో ఒక్కటయ్యే భార్య భర్తల జీవితం మనిషి జన్మలో మలుపు తిప్పే మరో అద్భుత ఘట్టం అని అంటారు. కానీ నేటి కాలంలో జరుగుతున్న భర్తలను భార్యలు హత్య చేస్తున్న ఘటనలు చూస్తుంటే సమాజం అసలు ఎటువైపు వెళుతుందో ఎవరికి అంత చిక్కడం లేదని చెప్పక తప్పడం లేదు. అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచాడన్న నెపంతో తన భార్యే తన చావుకు కారణం అవుతుందని తను అనుకోకుని ఉండకపోవచ్చు అలా తన భార్యే భర్తను చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ గ్రామానికి చెందిన హరి చరణ్, నాగలక్ష్మి దంపతులు అన్యోన్య దాంపత్యాన్ని గడిపినప్పటికీ మూడో వ్యక్తి వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. దీంతో భర్త హరిచరణ్ భార్య మరియు తర్వాత వచ్చిన ఆ మూడో వ్యక్తి ద్వారా చనిపోతాడని అనుకోలేదు కాబోలు. ఎందుకంటే భార్య నాగలక్ష్మి కి అదే గ్రామానికి చెందిన మహేష్ అనే ఆ మూడో వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీయడంతో అడ్డుగా ఉన్న భర్త హరిచరణ్ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్న భార్య నాగలక్ష్మి, తన ప్రియుడు మహేష్ తో కలిపి ఈనెల 22వ తేదీన భర్త మెడకు టవల్ ఉరివేసి చంపి బాత్రూం లో మూర్ఛ వ్యాధి వచ్చి చనిపోయి ఉండవచ్చని అందరినీ నమ్మించింది. కట్ చేస్తే విషయం తెలుసుకున్న కొడుకు కృష్ణ తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రి చనిపోయాడు అని మాత్రమే తెలుసుకున్న కృష్ణకి విషయం అర్థం కాకపోవడంతో అంత్యక్రియలు సైతం నిర్వహించుకున్నారు. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ మాట్లాడే తన తండ్రి హరిచరణ్ కి మూర్ఛవ్యాధి లేకపోవడం అది కూడా బాత్రూంలో మూర్చ వ్యాధి రావడం ఏంటని ఆలోచించినా కృష్ణ తన తల్లి నాగలక్ష్మిని గట్టిగా నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తన తండ్రి మృతి పై అనుమానం ఉందని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు తమదైన శైలిలో నాగలక్ష్మి విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని నాగలక్ష్మి మరియు మహేష్ ఇద్దరం కలిసే టవల్ తో హరిచరణ్ మెడకు ఉరిబిగించి బాత్రూంలో మూర్ఛ వ్యాధితో చనిపోయాడని నమ్మించామని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు మంగళవారం వారిద్దరిని అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డ ఇరువురిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏ.ఎస్.పి రాజేష్ మీనా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ముఖ్యపాత్ర పోషించిన సోన్ సిఐ, ఎస్.ఐ గోపి లను అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.