_*విజ్ఞాన్ కాలేజీలో జీఎస్టీ 2.0 పై అవగాహన*_
పొదలకూరు పున్నమి ప్రతినిధి: పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ఎకనామిక్స్,కామర్స్, తెలుగు అధ్యాపకులు రాజేంద్ర ప్రసాద్, దేవళ్ళ.కృష్ణ, ఏ.చంద్రశేఖర్ విద్యార్థులకు వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్బారావు, జీ.ఎన్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 లో భాగంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. ప్రస్తుతం తగ్గించిన జీఎస్టీపై అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0 రావడం వలన పేద ప్రజలకు, సన్నకారు రైతులకు, చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీలో వచ్చిన మార్పుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డీన్ సీ.హెచ్ .కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


