Wednesday, 30 July 2025
  • Home  
  • జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు
- Featured

జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు

మనుబోలు (పున్నమి విలేకరి)30,మే:కరోనా కల్లోలంలో మృత్యువాత పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజేపి జిల్లా నేత బోల శ్రీనివాసులు డిమాండ్ చేశారు .పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం లకు 50 లక్షలు బీమా ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టు సేవలను కూడా గుర్తించి వారికి కూడా 50 లక్షల బీమా ప్రకటించాలని కోరారు. కుటుంబాలను వదిలేసి అంకితభావంతో ముందుకు సాగుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవాలని కోరారు. వార్తలు సేకరించడం లో పని ఒత్తిడి వేగంగా వార్తలు సేకరించడం లో ఎందరో జర్నలిస్టులు కరోనా కాటుకు బలయ్యారు అని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తగినంత సాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవం లో జర్నలిస్టు చేస్తున్న సేవలు మరువలేనివని సంబంధిత మంత్రి స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పక్క రాష్ట్ర మైన తమిళనాడు ప్రభుత్వం పదిలక్షలు మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రకటించి అండగా నిలిచిందన్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు..


మనుబోలు (పున్నమి విలేకరి)30,మే:కరోనా కల్లోలంలో మృత్యువాత పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజేపి జిల్లా నేత బోల శ్రీనివాసులు డిమాండ్ చేశారు .పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం లకు 50 లక్షలు బీమా ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టు సేవలను కూడా గుర్తించి వారికి కూడా 50 లక్షల బీమా ప్రకటించాలని కోరారు. కుటుంబాలను వదిలేసి అంకితభావంతో ముందుకు సాగుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవాలని కోరారు. వార్తలు సేకరించడం లో పని ఒత్తిడి వేగంగా వార్తలు సేకరించడం లో ఎందరో జర్నలిస్టులు కరోనా కాటుకు బలయ్యారు అని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తగినంత సాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవం లో జర్నలిస్టు చేస్తున్న సేవలు మరువలేనివని సంబంధిత మంత్రి స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పక్క రాష్ట్ర మైన తమిళనాడు ప్రభుత్వం పదిలక్షలు మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రకటించి అండగా నిలిచిందన్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.