మనుబోలు( పున్నమి విలేఖరి)17,జనవరి: మనుబోలు మండలం అక్కంపేట గ్రామం లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగింది లబ్ధిదారులకు “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంలో భాగంగా ఆదివారం సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్రాంతి పండుగను తలపిస్తుందని అన్నారు. పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీతో ప్రజలలో ఆనందోత్సాహాలు నెలకొన్నందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 10 వేల కోట్లు వెచ్చించి, 30 లక్షల 75 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకు ఇళ్లస్థలాలు అందించడం నాకు దక్కిన వరంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఎన్ని విమర్శలు గుప్పించినా, అడ్డుకోవడానికి ఎంత రాద్ధాంతం సృష్టించినా, ఏ మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ప్రకడ్బందీగా ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయబోతున్నామని మరోసారి గుర్తుచేశారు.ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధారించిన మూడు విధానాలలో లబ్ధిదారుడు కోరుకున్న విధంగా ఇళ్లు నిర్మించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నడూ జరగని రీతిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోవు రోజుల్లో వ్యక్తిగత సమస్యలకు తప్ప, గ్రామ అవసరాలకు ఒక్క అర్జీ కూడా ఇవ్వవలసిన అవకాశం రాకుండా, అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశమిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డలా సేవలు అందించి, రుణం తీర్చుకుంటానని అన్నారు .పెన్షన్లు రేషన్ బియ్యం ఇంటికి వద్దకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను జగన్మోహన రెడ్డి చేస్తున్నారని తెలిపారు. అధికారంలో లేనప్పుడు సోమిరెడ్డికి భయపడలేదని ఇప్పుడు ఎందుకు భయపడుతానని ఆవేశంగా ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు కనిపించేది లేదని విమర్శించారు. ప్రభుత్వంలేఅవుట్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి తొమ్మిది అంకణాల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు భయపడేది లేదని ఆవేశంగా ప్రసంగించారు అమ్మ ఒడి పథకం తో సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చిందని తెలిపారు. అనంతరం అక్కంపేట మాజీసర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోఎమ్మెల్యే కాకాని అక్కంపేట లో కిరణ్ రెడ్డి మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదని తెలిపారు. గ్రామంలో పేదలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ను సత్కరించి పట్టు వస్త్రాలను అందజేసి గజమాలతో ఎమ్మెల్యే ను సత్కరించారు. ఫ్లెక్సీలతో ఎమ్మెల్యేకుఅడుగడుగునా మేళతాళాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికివైకాపా నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడి వేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అనమాల ప్రభాకర్ రెడ్డి,ఆవుల తులసిరామ్ యాదవ్,గుంజి రమేష్ ,ప్రదీప్ కుమార్ రెడ్డి అధికారులతోపాటు మండల వ్యాప్తంగా వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్సై ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్రాంతి పండుగ ను తలపిస్తుంది :ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
మనుబోలు( పున్నమి విలేఖరి)17,జనవరి: మనుబోలు మండలం అక్కంపేట గ్రామం లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగింది లబ్ధిదారులకు “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంలో భాగంగా ఆదివారం సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్రాంతి పండుగను తలపిస్తుందని అన్నారు. పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీతో ప్రజలలో ఆనందోత్సాహాలు నెలకొన్నందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 10 వేల కోట్లు వెచ్చించి, 30 లక్షల 75 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకు ఇళ్లస్థలాలు అందించడం నాకు దక్కిన వరంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఎన్ని విమర్శలు గుప్పించినా, అడ్డుకోవడానికి ఎంత రాద్ధాంతం సృష్టించినా, ఏ మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ప్రకడ్బందీగా ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయబోతున్నామని మరోసారి గుర్తుచేశారు.ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధారించిన మూడు విధానాలలో లబ్ధిదారుడు కోరుకున్న విధంగా ఇళ్లు నిర్మించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నడూ జరగని రీతిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోవు రోజుల్లో వ్యక్తిగత సమస్యలకు తప్ప, గ్రామ అవసరాలకు ఒక్క అర్జీ కూడా ఇవ్వవలసిన అవకాశం రాకుండా, అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశమిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డలా సేవలు అందించి, రుణం తీర్చుకుంటానని అన్నారు .పెన్షన్లు రేషన్ బియ్యం ఇంటికి వద్దకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను జగన్మోహన రెడ్డి చేస్తున్నారని తెలిపారు. అధికారంలో లేనప్పుడు సోమిరెడ్డికి భయపడలేదని ఇప్పుడు ఎందుకు భయపడుతానని ఆవేశంగా ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు కనిపించేది లేదని విమర్శించారు. ప్రభుత్వంలేఅవుట్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి తొమ్మిది అంకణాల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు భయపడేది లేదని ఆవేశంగా ప్రసంగించారు అమ్మ ఒడి పథకం తో సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చిందని తెలిపారు. అనంతరం అక్కంపేట మాజీసర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోఎమ్మెల్యే కాకాని అక్కంపేట లో కిరణ్ రెడ్డి మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదని తెలిపారు. గ్రామంలో పేదలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ను సత్కరించి పట్టు వస్త్రాలను అందజేసి గజమాలతో ఎమ్మెల్యే ను సత్కరించారు. ఫ్లెక్సీలతో ఎమ్మెల్యేకుఅడుగడుగునా మేళతాళాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికివైకాపా నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడి వేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అనమాల ప్రభాకర్ రెడ్డి,ఆవుల తులసిరామ్ యాదవ్,గుంజి రమేష్ ,ప్రదీప్ కుమార్ రెడ్డి అధికారులతోపాటు మండల వ్యాప్తంగా వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్సై ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.