బిజెపి మనుబోలు మండల నూతన అధ్యక్షుడుగా ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

    0
    187

    31-05-2020మనుబోలు ( పున్నమి ప్రతినిధి)తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ.సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి అధ్యక్షతన మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో బిజెపి మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనుబోలు మండల బిజెపి అధ్యక్షుడిగా ఓడూరు శ్రీనివాసులురెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండల స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తనను బిజెపి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల నాయకులకు కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకులు అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని మనుబోలు మండలం లో గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ మరియు మనుబోలు మండల బిజెపి నాయకులుచల్లా లక్ష్మయ్య ,దగ్గవోలు రామిరెడ్డి ,ముప్పవరపు చిన్న, ఇరగ రాజ అంకయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.