మనుబోలు 18-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ )మనుబోలు మండలం మనుబోలుగ్రామం లోని బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం ను నెల్లూరు డివిజన్ ఆర్డీవో హుస్సేన్ బాషా గారు పర్యటించారు గత రెండునెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి తాజా గా మనుబోలును తాకింది. దీంతో గ్రామంలో ఆర్డీవో హుస్సేన్ బాష పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు బిసికాలనిలో వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఇంటిపరిసరాలను కంటైన్మేంట్ జోన్ గా పరిగణించి గ్రామాన్ని రెడ్జోన్ గా ప్రకటించి పోలీసు లకు ఆదేశాలు జారీచేశామన్నా రు. అదేవిధంగా నలుగురు కుటుంబ సభ్యులు ను నెల్లూరు క్వారెంటైన్ కు తరలించామన్నారు .కారోన పాజిటివ్ వచ్చిన రాపూరు చిన్న రాగయ్య నివాసం ఉంటున్న రెండు ప్రాంతాలను కంటైన్మెంట్ కోర్ జోన్ లోకి తీసుకోవడం జరిగిందని అతను నివాసం ఉన్న ప్రాంతం లోని ప్రతి ఒక్కరికి కరోన పరీక్షలు చేయడం జరుగుతోందని ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్లకు పది సంవత్సరాలు లోపు పిల్లలకు ప్రత్యేకముగా పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందించడం జరుగుతుందని తెలిపినారు.సిఐ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ కోయంబేడు కలకలంలో అనుమానితుడు రాపూరు చిన్న రాగయ్య ను ఐదురోజుల క్రితం అదుపులో తీసుకుని క్వారంటైన్ తరిలించామని ఆదివారం పరీక్ష లో అతనికి పాజిటివ్ అనితేలడంతో గ్రామం రెడ్జోన్ లో 28రోజులుంటుందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వెంకటేశ్వర్లు,తహశీల్దార్ ఆనందరావు,వైద్య ధికారిణి శ్వేత ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు ను తాకిన కరోనా
మనుబోలు 18-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ )మనుబోలు మండలం మనుబోలుగ్రామం లోని బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం ను నెల్లూరు డివిజన్ ఆర్డీవో హుస్సేన్ బాషా గారు పర్యటించారు గత రెండునెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి తాజా గా మనుబోలును తాకింది. దీంతో గ్రామంలో ఆర్డీవో హుస్సేన్ బాష పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు బిసికాలనిలో వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఇంటిపరిసరాలను కంటైన్మేంట్ జోన్ గా పరిగణించి గ్రామాన్ని రెడ్జోన్ గా ప్రకటించి పోలీసు లకు ఆదేశాలు జారీచేశామన్నా రు. అదేవిధంగా నలుగురు కుటుంబ సభ్యులు ను నెల్లూరు క్వారెంటైన్ కు తరలించామన్నారు .కారోన పాజిటివ్ వచ్చిన రాపూరు చిన్న రాగయ్య నివాసం ఉంటున్న రెండు ప్రాంతాలను కంటైన్మెంట్ కోర్ జోన్ లోకి తీసుకోవడం జరిగిందని అతను నివాసం ఉన్న ప్రాంతం లోని ప్రతి ఒక్కరికి కరోన పరీక్షలు చేయడం జరుగుతోందని ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్లకు పది సంవత్సరాలు లోపు పిల్లలకు ప్రత్యేకముగా పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందించడం జరుగుతుందని తెలిపినారు.సిఐ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ కోయంబేడు కలకలంలో అనుమానితుడు రాపూరు చిన్న రాగయ్య ను ఐదురోజుల క్రితం అదుపులో తీసుకుని క్వారంటైన్ తరిలించామని ఆదివారం పరీక్ష లో అతనికి పాజిటివ్ అనితేలడంతో గ్రామం రెడ్జోన్ లో 28రోజులుంటుందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వెంకటేశ్వర్లు,తహశీల్దార్ ఆనందరావు,వైద్య ధికారిణి శ్వేత ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.