చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పై అవగాహన

0
286

రాపూరు మండల పరిషత్ కార్యాలయం నందు డివిజన్ పంచాయతీ ఆఫీసర్ కృష్ణ మోహన్ రావు మండలంలోని 21 పంచాయతీ కార్యదర్శుల తో సమావేశం నిర్వహించారు S W P C ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ) పై అవగాహన కలిగిస్తూ రాపూరు మండలంలో 6 షెడ్లు కంప్లీట్ అయ్యాయి 2 షెడ్లు కంప్లీట్ కావలసి ఉన్నాయని తెలిపారు ఈ షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ తయారుచేసి ఆ గ్రామాలలో రైతులకు విక్రయిస్తామని తెలుపుతూ పంచాయతీలకు ఇదివరకే ఇచ్చిన బుష్ కట్టర్, స్ప్రే మిషన్స్ ,మూడు చక్రాల సైకిల్ లు, ట్రాక్టర్లు గురించి అడిగి తెలుసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఇంటి పన్నులు, కొళాయి పన్నుల బకాయిలు 31-3-2020 నాటికి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని తెలియజేసి సిద్దవరం గ్రామంలో షెడ్లను తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి వెంట ఈ.ఓ.పి.ఆర్.సి గంగయ్య పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు