శ్రీకాళహస్తిలో శుక బ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాశీ వన క్షేత్రం పీఠాధిపతి శ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ అనంఘబాషణం చేస్తూ గురువు దైవంతో సమానమని,గురు సారధ్యంలో సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గం లో సాగి మోక్షమార్గాన్ని పొందాలన్నారు.మనసుకు దాసోహం అయ్యేవాడు మానవుడు,మనస్సు ను జయించే వాడే మాధవుడని, మనస్సును జయించిన మహాత్ములే గురువులని, గురువులే మాధవుల ప్రతిరూపమని గురువు ఎడల భక్తి భయంతో ఉంటూ భక్తి యోగం సాధన ద్వారా ముక్తి యోగం పొందాలని మాతాజీ సూచించారు.ప్రవచనాలు ముగింపు సందర్భంగా శుక బ్రహ్మ ఆశ్రమం తరఫున ఆశ్రమ పీఠాధిపతులు శ్రీవిద్యా స్వరూపానందగిరి స్వామి యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీని ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు.

మనసుకు దాసుడు మానవుడు మనసును జయించేవాడు మాధవడు.
శ్రీకాళహస్తిలో శుక బ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాశీ వన క్షేత్రం పీఠాధిపతి శ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ అనంఘబాషణం చేస్తూ గురువు దైవంతో సమానమని,గురు సారధ్యంలో సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గం లో సాగి మోక్షమార్గాన్ని పొందాలన్నారు.మనసుకు దాసోహం అయ్యేవాడు మానవుడు,మనస్సు ను జయించే వాడే మాధవుడని, మనస్సును జయించిన మహాత్ములే గురువులని, గురువులే మాధవుల ప్రతిరూపమని గురువు ఎడల భక్తి భయంతో ఉంటూ భక్తి యోగం సాధన ద్వారా ముక్తి యోగం పొందాలని మాతాజీ సూచించారు.ప్రవచనాలు ముగింపు సందర్భంగా శుక బ్రహ్మ ఆశ్రమం తరఫున ఆశ్రమ పీఠాధిపతులు శ్రీవిద్యా స్వరూపానందగిరి స్వామి యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీని ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు.

