Sunday, 7 December 2025
  • Home  
  • కురబలకోట: పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్ మెన్ పరార్
- అన్నమయ్య

కురబలకోట: పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్ మెన్ పరార్

వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేసే పింఛన్ డబ్బులతో ఉద్యోగి పరారైన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకొంది. కురబలకోట ఎంపీడీఓ గంగయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంగళ్లుకు చెందిన వెంకటేష్.. కురబలకోట మండలం తెట్టు సచివాలయంలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తెట్టు దళితవాడను వెంకటేష్ కు అప్పగించారు. మొత్తం 80మందికి పైగా లబ్ధిదారులకు రూ.4.90లక్షల సోమవారం ఉదయం పంపిణీ చేయాల్సి ఉండగా ఆ డబ్బు తీసుకొన్న వెంకటేష్ పంపిణీ చేయకుండా పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని ఈ విషయం పై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేసే పింఛన్ డబ్బులతో ఉద్యోగి పరారైన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకొంది. కురబలకోట ఎంపీడీఓ గంగయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంగళ్లుకు చెందిన వెంకటేష్.. కురబలకోట మండలం తెట్టు సచివాలయంలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తెట్టు దళితవాడను వెంకటేష్ కు అప్పగించారు. మొత్తం 80మందికి పైగా లబ్ధిదారులకు రూ.4.90లక్షల సోమవారం ఉదయం పంపిణీ చేయాల్సి ఉండగా ఆ డబ్బు తీసుకొన్న వెంకటేష్ పంపిణీ చేయకుండా పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని ఈ విషయం పై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.