పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైస్ షర్మిల రెడ్డి నెల్లూరు పర్యటనను విజయవంతం చేయండి – డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి పిలుపు

0
85

పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైస్ షర్మిల రెడ్డి నెల్లూరు పర్యటనను విజయవంతం చేయండి – డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి పిలుపు
నెల్లూరు జూన్ (పున్నమి ప్రతినిధి)

నెల్లూరు, 10 జూన్ 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైస్ షర్మిల రెడ్డి గారు, జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 13వ తేదీన (శుక్రవారం) నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా నిర్వహించబోయే పార్టీ సమీక్షా సమావేశాన్ని ఘనవంతం చేయాలని, అన్ని స్థాయిల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు, నెల్లూరు ఇందిరా భవన్ వద్ద ప్రారంభం కానుంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు అందరూ పాల్గొని పార్టీ బలోపేతానికి తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకోవాలని డిసిసి అధ్యక్షులు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పునరుత్థానమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పిసిసి అధ్యక్షురాలి పర్యటనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here