నెల్లూరు: ప్రసిద్ధ కవి, చింతన కర్త దువ్వూరు రామిరెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మార్చి 4వ తేదీన నిర్వహించిన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరేబా ల కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీ దొడ్ల మురళీ కృష్ణా రెడ్డి, కుమారి ప్రవల్లిక, శ్రీమతి శ్రీదేవి, శ్రీ దగ్గుమాటి కృష్ణ, శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ జయ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి గూడూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దువ్వూరి గారి సాహిత్య సేవలను గుర్తు చేస్తూ వారందరూ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సభను బి. సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రటరీ, దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి నిర్వహించారు.