87వ వార్డ్ పరిధిలో ముఖ్య మంత్రి సహాయానిది అందజేత….
విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:-
ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్).
గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో గవరవీధి ప్రాంతానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా సిఎం సహాయనిది అండగా నిలుస్తుందని అందులో భాగంగా గత కొద్దీరోజుల క్రితం అనారోగ్యానికి గురై చికిత్స పొందిన కాండ్రేగుల శ్రీనివాసరావు కు 41048/- రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రావు గారు ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసి ఆమోదం పొందేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు,ప్రగడ దానయ్య, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ,ఆనంద్ కుమార్, కడుపుట్ల శ్రీను, గండేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.


