శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఏ.ఎమ్. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్.డి. యోగానంద్ ఆయిల్ మిల్లును మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మిల్లుకు సంబంధించి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను రశీదులు, భవన నిర్మాణ అనుమతులు ఏవీ లేవని గుర్తించారు. వీటికి తోడు గోడౌన్ లోపల పరిసరాలు బూజు పట్టి, అపరిశుభ్రంగా ఉండి ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. అవసరమైన పత్రాలను సమర్పించాలని యజమానికి 48 గంటల సమయం ఇచ్చినప్పటికీ, ఎలాంటి డాక్యుమెంట్లు కార్యాలయంలో సమర్పించలేదు. దీంతో 1965 మున్సిపల్ చట్టంలోని సెక్షన్లు 293, 294, 295, 296 ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో వీఆర్వోల సమక్షంలో పంచనామా నిర్వహించి, ఆయిల్ మిల్లును మరియు స్టాక్ రవాణా కాకుండా పరిసర ప్రాంతాలను సీజ్ చేశారు. కేవలం వ్యాపార నిమిత్తం వాడే గోడౌన్ ప్రాంతాన్ని మాత్రమే సీజ్ చేశామని, వారి గృహానికి ఎలాంటి సీజ్ చేయలేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

48 గంటల గడువు ఇచ్చినా బదులు లేదు.. చట్టపరంగా ఆయిల్ గోడౌన్ క్లోజ్
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఏ.ఎమ్. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్.డి. యోగానంద్ ఆయిల్ మిల్లును మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం నాడు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మిల్లుకు సంబంధించి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను రశీదులు, భవన నిర్మాణ అనుమతులు ఏవీ లేవని గుర్తించారు. వీటికి తోడు గోడౌన్ లోపల పరిసరాలు బూజు పట్టి, అపరిశుభ్రంగా ఉండి ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. అవసరమైన పత్రాలను సమర్పించాలని యజమానికి 48 గంటల సమయం ఇచ్చినప్పటికీ, ఎలాంటి డాక్యుమెంట్లు కార్యాలయంలో సమర్పించలేదు. దీంతో 1965 మున్సిపల్ చట్టంలోని సెక్షన్లు 293, 294, 295, 296 ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో వీఆర్వోల సమక్షంలో పంచనామా నిర్వహించి, ఆయిల్ మిల్లును మరియు స్టాక్ రవాణా కాకుండా పరిసర ప్రాంతాలను సీజ్ చేశారు. కేవలం వ్యాపార నిమిత్తం వాడే గోడౌన్ ప్రాంతాన్ని మాత్రమే సీజ్ చేశామని, వారి గృహానికి ఎలాంటి సీజ్ చేయలేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

