నాయుడుపేట, ఆగస్టు, పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట లో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ కు శ్రావణమాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా 400 కిలోల నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.


