*2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిన – TGTJAC గౌరవాధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు TG TJAC సెక్రటరీ జనరల్ శానమోనినర్సిములు గారు*
*పున్నమి ప్రతినిధి* *హైదరాబాద్ తేది::*
*11.03.2026*
*నాడు TPCC అధికార ప్రతినిధి, TG TJAC గౌరవాధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి గారి నేతృత్వంలో.. *. TGTJAC సెక్రెటరీ జనరల్ శానమోని నర్సిములు*
*గారు ముఖ్యమంత్రి సలహాదారులు శ్రీ వేంనరేందర్ రెడ్డి గారిని కలిసి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ క్రింది సమస్యలపై విజ్ఞప్తి చేయడం జరిగింది.
అనుకూలంగా స్పందించిన వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమావేశ పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రాతినిధ్యం చేసిన అంశాలు :
1. డీఎస్సీ 2003 అభ్యర్థులకు పాత పెన్షన్ అమలు చేయాలి
2. ఆధార్ మిస్ మ్యాచ్ అయిన కారణంగా ఆగిపోయిన 216 మంది ఉపాధ్యాయుల జీతాలను వెంటనే మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలి.
3. జీవో 317 బాధితులైన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లను (డిస్ లొకేటెడ్ నాన్ డిస్ లోకేటెడ్ ఇరువురికి) త్వరగా ఇవ్వాలి.
4. జీవో 190 ను సవరించి అప్గ్రేడ్ అయిన భాషాపండితులకు కూడా కనీసం తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్స్ ఇచ్చి సొంతజిల్లాలకు కేటాయించాలి.
5. మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలి.
6. మిగిలిపోయిన స్పౌస్ లు, అంతర్ జిల్లా స్పౌస్ లు, సెంట్రల్ స్పౌస్ లకు కూడా అవకాశం ఇస్తే స్పౌస్ లు అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు

