₹13.75 లక్షల విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐ అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తీక్, జోగారావు బృందం విజయవంతంగా నిర్వహించింది.
ముంచంగిపుట్టు నుంచి రాజస్థాన్కు తరలించేందుకు ప్రయత్నించిన 275 కిలోల గంజాయి, టాటా కరువి కార్, రెండు బైక్లు, ఐదు మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ
డ్రగ్స్ రవాణా, వాడకం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజలు సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అన్నారు.


