ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో గల 15 కార్పొరేషన్ డివిజన్ లలో ప్రజల సమస్య లు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కొరకు పోరాటం చేసే ఆలోచనలో భాగంగా బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ చేపట్టిన డివిజన్ ల యాత్ర కార్యక్రమం ప్రజల్లో చర్చ ని తీసుకోని వచ్చింది. పార్టీ లు వేరు అయినా అధికారం వారిదే అని ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ ల పని తీరు పట్ల విసిగి వేజారి పోయిన రెండవ పట్టణ పరిధిలో గల 15 డివిజన్ ల ప్రజలు ఈ సారి జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కీ మద్దత్తు తెలపాలి అని దృఢ నిశ్చయము తో ఉన్నారు.
ప్రజా సమస్య ల పరిష్కారం కోరుతూ యాత్ర చెపట్టిన బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటే నారాయణ యాదవ్ కీ ఈ సందర్భంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. నేడు జరిగే 57 వ డివిజన్ యాత్ర లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సైతం పాల్గొనబోతుండటం ఈ యాత్ర యొక్క ప్రభావం కీ నిదర్శనం అనే చెప్పాలి.


