పున్నమి ప్రతినిధి
బీసీ రిజర్వేషన్ అంశం లో తెలంగాణ హై కోర్టు వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘము జాతీయ నేత రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 18 న ఇచ్చిన బంద్ పిలుపు కి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దత్తు తెలియజెస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు తెలియా జేశారు. బుధవారం నాడు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యలయం కి వచ్చిన బీసీ సంఘాల నేతలతో రామ చంద్రరావు మాట్లాడుతు బీసీ వ్యక్తి ని ప్రధాని ని చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలని కోరారు.


