Sunday, 12 April 2026
  • Home  
  • 🤝 కష్టకాలంలో అండగా ‘మానవత’ – షుగర్ బాధితుడికి రూ.6,000 ఆర్థికసాయం
- తూర్పు గోదావరి

🤝 కష్టకాలంలో అండగా ‘మానవత’ – షుగర్ బాధితుడికి రూ.6,000 ఆర్థికసాయం

తాళ్లపూడి, ఫిబ్రవరి 25 (పున్నమి ప్రతినిధి): మానవతను ఆచరణలో చూపిస్తూ తాళ్లపూడిలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దేవం వాసి గుండేపల్లి నాగేశ్వరరావుకు ఇటీవల కాలి వేలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులు, మెడిసిన్ వ్యయాలకు తోడ్పడేందుకు సంస్థ తరఫున రూ.6,000 ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవడమే మానవత ధ్యేయమని పేర్కొన్నారు. సంస్థ తన వంతుగా అధిక మొత్తంలో నిధులను విద్యా, వైద్య సేవల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. అవసరమైన చోట సహాయం అందించడం ద్వారా సమాజానికి తోడ్పడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, దుగ్గిరాల సూర్యనారాయణ, సాయన సుబ్బారావు, కొప్పాక వెంకటేశ్వరరావు, అయినాల మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతున్న మానవత సంస్థ కార్యకలాపాలు స్థానికుల ప్రశంసలను అందుకుంటున్నాయి.

తాళ్లపూడి, ఫిబ్రవరి 25 (పున్నమి ప్రతినిధి):
మానవతను ఆచరణలో చూపిస్తూ తాళ్లపూడిలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దేవం వాసి గుండేపల్లి నాగేశ్వరరావుకు ఇటీవల కాలి వేలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులు, మెడిసిన్ వ్యయాలకు తోడ్పడేందుకు సంస్థ తరఫున రూ.6,000 ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవడమే మానవత ధ్యేయమని పేర్కొన్నారు. సంస్థ తన వంతుగా అధిక మొత్తంలో నిధులను విద్యా, వైద్య సేవల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. అవసరమైన చోట సహాయం అందించడం ద్వారా సమాజానికి తోడ్పడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, దుగ్గిరాల సూర్యనారాయణ, సాయన సుబ్బారావు, కొప్పాక వెంకటేశ్వరరావు, అయినాల మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతున్న మానవత సంస్థ కార్యకలాపాలు స్థానికుల ప్రశంసలను అందుకుంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.