Sunday, 7 December 2025
  • Home  
  • 📰 మధుమేహం నివారణకు ముందడుగు – అపోలోలో అవగాహన కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

📰 మధుమేహం నివారణకు ముందడుగు – అపోలోలో అవగాహన కార్యక్రమం

ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా, అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ అధిపతి డాక్టర్ బిందు రెడ్డి, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ ఎం.వి. రామ్మోహన్ పాల్గొని మధుమేహంపై విస్తృత అవగాహన కల్పించారు. వైద్యులు మాట్లాడుతూ మధుమేహం వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటని, అధిక బరువు, వ్యాయామం లోపం, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య ప్రభావం ప్రధాన కారణాలని వివరించారు. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు, హృద్రోగాలు, మూత్రపిండ, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. నివారణ కోసం ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం, తక్కువ చక్కెర–తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించడం, రక్త చక్కెర–రక్తపోటు–కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం తప్పనిసరి అని సూచించారు. సరైన మార్గదర్శకత్వం కోసం వైద్యులను సంప్రదించాలి అని అన్నారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. రూ.2100 విలువైన పరీక్షలను రూ.699కు, రూ.4500 విలువైన పరీక్షలను రూ.1899కు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా, అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ అధిపతి డాక్టర్ బిందు రెడ్డి, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ ఎం.వి. రామ్మోహన్ పాల్గొని మధుమేహంపై విస్తృత అవగాహన కల్పించారు.
వైద్యులు మాట్లాడుతూ మధుమేహం వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటని, అధిక బరువు, వ్యాయామం లోపం, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య ప్రభావం ప్రధాన కారణాలని వివరించారు. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు, హృద్రోగాలు, మూత్రపిండ, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
నివారణ కోసం ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం, తక్కువ చక్కెర–తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించడం, రక్త చక్కెర–రక్తపోటు–కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం తప్పనిసరి అని సూచించారు. సరైన మార్గదర్శకత్వం కోసం వైద్యులను సంప్రదించాలి అని అన్నారు.
ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. రూ.2100 విలువైన పరీక్షలను రూ.699కు, రూ.4500 విలువైన పరీక్షలను రూ.1899కు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.