ఏడునూతుల, సెప్టెంబర్ 5:
జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఆనందభరితంగా, ఘనంగా జరిపారు. విద్యార్థులు తమ గురువులకు పూలమాలలు, కిరీటాలు, టవల్, బొకేలతో సన్మానం చేసి, ఉపాధ్యాయుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భాస్కర్ మాడరాజు (SA-Maths) గారిని విద్యార్థులు ఘనసత్కారం చేయడం విశేషం. విద్యార్థులు గురువులు తమ జీవితాలను తీర్చిదిద్దే శిల్పులు అని భావోద్వేగంగా వెల్లడించారు.
విద్యార్థులు నిర్వహించిన డ్యాన్స్లు, ప్రసంగాలు, పాటలు, అంకరింగ్ మరియు మొత్తం కార్యక్రమం నిర్వహణ అద్భుతంగా సాగింది. ప్రతి తరగతి విద్యార్థులు ముందుండి పాల్గొని, ఈ వేడుకను మరపురాని సందర్భంగా మలిచారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య మాట్లాడుతూ:
“ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, విద్యార్థి భవిష్యత్తుకు దీపస్తంభం. ఉపాధ్యాయుని త్యాగం వల్లే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, విజయశ్రీ పాల్గొన్నారు.


