✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు.
పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు.
ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే, ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.


