పున్నమి ప్రతినిధి నెల్లూరు రూరల్ రాఘవేంద్ర
*హౌసింగ్ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం*
*లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు*
*ఇళ్లను నాసిరకంగా కట్టడమే కాదు సిమెంట్, స్టీలు కూడా అమ్మేసుకున్నారు*
*వైసీపీ పాలనలో వెలుగులోకి వచ్చిన తాత్కాలిక కాంట్రాక్టర్లు భారీగా దోచుకున్నారు*
*బ్లాక్ లిస్టులో పెడతామని భయపెట్టేందుకు వారేమి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కాదు*
*హౌసింగ్ శాఖలో జరిగిన అవినీతిపై లోతైన విచారణ జరగాల్సిందే*
నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలో శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్
ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ , ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు జిల్లా అధికారులు
*ఈ సమావేశంలో బీద మాట్లాడుతూ*
*నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ మారింది, విచ్చలవిడిగా వ్యవహరించి లబ్ధిదారుల జీవితాలను చిద్రం చేస్తోంది.*
*శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి ఆన్ లైన్ లో హౌసింగ్ నిర్మాణాల గురించి పరిశీలించాము . ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది.*
*బేస్ మెంట్ లెవెల్ ఇళ్ళకు శ్లాబులు వేసినట్టు కాంట్రాక్టర్లు చూపించారు. ఇళ్ళు ఇవ్వకుండానే బిల్లులు తీసుకున్నారు, థర్డ్ పార్టీ విచారణ లేకపోవడం వీరికి అనుకూలంగా మారింది.*
*స్టీల్, సిమెంట్ ను కాంట్రాక్టర్లు ముందుగానే డ్రా చేసి అమ్మేశారు. ఇళ్లు మంజూరు అయిన విషయం కనీసం లబ్ధిదారులకు సైతం తెలీకపోవడం శోచనీయం.*
*బ్లాక్ లిస్ట్ లో పెట్టి భయపెట్టేందుకు, సరి చేసేందుకు పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏమీ రెగ్యులర్ కాదు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా నమోదు కానివారు.*
*ప్రభుత్వం ఏదైనా అధికారులలో మాత్రం నిర్లక్ష్యం తీవ్రస్థాయిలో ఉంది. దీనికితోడు చర్యలు తీసుకోకపోవడం వీరికి అలుసుగా మారింది.*
*ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ.ఈ., డీ.ఈ. లు మారరు. సంబంధిత సమస్యలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్యుద్దాలు జరుగుతుంటే వీరు చోద్యం చూస్తుంటారు.*
*నాణ్యత ఒక్కటే పరీక్షించి అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదు, మెటీరియల్(స్టీల్, సిమెంట్), ఫిజికల్ బెనిఫిషియర్ (లబ్ధిదారులు) వివరాలను సైతం పరిశీలించాలి.*
*అల్లూరు మండలం హౌసింగ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై స్వయంగా విచారించి పి.డి. గారికి నేనే స్వయంగా ఫిర్యాదు చేశాను. లబ్ధిదారుల వివరాలతో పాటు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను.*
*హౌసింగ్ నిర్మాణం, మంజూరైన ఇళ్ళు, లబ్ధిదారుల వివరాలపై విచారణ కమిటీ వేశానని పి.డి. గారు చెప్పారు… కానీ నేటికి వాటి గురించి రిపోర్ట్ నాకు అందలేదు.*
*ఆన్ లైన్ లో ఇళ్లు మంజూరు అయ్యాయని చూపిస్తున్న కారణంగా ఏ పేదవాడు భవిష్యత్తులో ఇల్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, కేంద్రం ఎంత నిధులు ఇచ్చినా, కలెక్టర్లు కనికరించినా పేదవాడికి న్యాయం జరగదు.*
*హౌసింగ్ నిర్మాణాలలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యం పై, లబ్ధిదారులకు జరగాల్సిన న్యాయం పట్ల కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి లోతైన విచారణ చేపట్టాలి. లేనిపక్షంలో పేదవాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి.


