హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం
రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల సర్కిల్ జిహెచ్ఎంసి ఫిబ్రవరి 8:
ఆదిభట్ల సర్కిల్ కార్యాలయ పరిధి మంగళపల్లి ప్రధాన రోడ్ లో గల సాహస అర్బన్ డైన్ ఇన్ హోటలను శనివారం గ్రేటర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇతనికీలో తేల్చారు. నిషేధిత పదార్థాలతో తయారుచేసిన ఆహారాన్ని పడేశారు వినియోగదారులకు రుచికరంగా ఉండేందుకు నిషేధిత టెస్టింగ్ ఉప్పు ని వాడినట్లు గుర్తించారు. హోటల్లో శుభ్రత పాటించట్లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళ అధికారి ఎన్ వనిత అక్కడి పరిస్థితిని తన చరవానీ లో రికార్డు చేస్తుండగా హోటల్ సిబ్బంది తనను బెదిరించారని చరవాణిని లాక్కున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.



