పలమనేరు , డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… బంగ్లాదేశ్లో హిందువుల ఆస్థులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులు, హిందూ ఆలయాలను ధ్వసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ సిద్దయ్య, సత్య ప్రకాష్ , జనార్దన్,మురుగన్, రాజేంద్ర స్వామి,శరవణ, ఆనంద తీర్థ, గోవింద్, ప్రవీణ్, మోహన్,వంశీ, భార్గవ్, శక్తి, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హిందువులపై దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
పలమనేరు , డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… బంగ్లాదేశ్లో హిందువుల ఆస్థులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులు, హిందూ ఆలయాలను ధ్వసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ సిద్దయ్య, సత్య ప్రకాష్ , జనార్దన్,మురుగన్, రాజేంద్ర స్వామి,శరవణ, ఆనంద తీర్థ, గోవింద్, ప్రవీణ్, మోహన్,వంశీ, భార్గవ్, శక్తి, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

