పున్నమి న్యూస్ (కోనసీమ) సీనియర్ జర్నలిస్ట్ రమణ: నీతి ఆయోగ్/ హోం మంత్రిత్వ శాఖ ద్వారా నామినేట్ చేయబడిన అఫిషియల్ లాంగ్వేజ్ హిందీ సలహా కమిటీ సభ్యుడు గా షంసు సాదిక్ నియమితులయ్యారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గా బాధ్యత నిర్వహిస్తున్న సాదిక్ కు జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్ట్ కేంద్ర హోమ్ శాఖ నుండి ఆదేశాలు అందాయి అని తెలియచేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి మోదీ కి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఆంధ్ర రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ కి, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలియచేశారు. వారితో పాటు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ కి, జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ శాసన సభ్యులు వేమా కి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కి, మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ పొట్లూరి రామ్ మోహన్ రావు కి, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు కి గుంటూరు జిల్లా ఇంచార్జ్ రామకృష్ణారెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం కి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కి, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వపు అధ్యక్షులు యాళ్ళ దొరబాబు కి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీర బాబు కి,చీకురుమిల్లి శ్రీనివాస్ కి,కొప్పనాతి దత్తాత్రేయ కి మరియు రాష్ట్రం లో ఉన్న జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు మరియు వివిధ బాధ్యతలో ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.


