చిట్వేలి: జూలై 22 ( పున్నమి న్యూస్ )
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొణిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సందర్భంగా అఖండ విజయం సాధించాలని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో చిట్వేలి శివాలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర స్థానిక నాయకులు మాదాసు నరసింహులు, మద్దూరి మన్మధ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లోనూ మరొకవైపు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారని మనం అనుకుంటున్నామే గాని రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకి ఎప్పుడు ప్రాధాన్యత గానే ఉంటాయన్నారు దేశభక్తితో కూడిన ఈ భారీ సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత ఏ ఎం రత్నంకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కి వారు కృతజ్ఞతలు చెప్పారు బుధవారం సాయంత్రం కోడూరులో జరగబోయే భారీ ర్యాలీకి చిట్వేల్ మండలం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు


