Wednesday, 25 March 2026
  • Home  
  • స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు. -గుబ్బల రాంబాబుకు నగరపు ప్రముఖుల అభినందనలు .
- తూర్పు గోదావరి

స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు. -గుబ్బల రాంబాబుకు నగరపు ప్రముఖుల అభినందనలు .

గత 27 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ సామాజిక సేవలు అందిస్తూ నగర ప్రజల, దాతల ఆదరాభిమానాలు పొందింది. స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ చేపట్టిన కార్యక్రమాలను స్వర్ణాంధ్ర ప్రజలకు చేరువ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డుకి ఎంపికైనట్లు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ ఆరవ తేదీన గుబ్బల రాంబాబు ఈ అవార్డును అందుకోనున్నారు.స్వర్ణాంధ్ర సేవా సంస్థకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని రాంబాబు తెలిపారు.1998లో ప్రారంభించబడిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగరాన్ని సుందర రాజమండ్రి గా మార్చడానికి దోమల నిర్మూలనకు ఇంటింటా లేవటరి గొట్టాలకు నెట్టలు కట్టింది. నగరంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్లడానికి వేలాది కరపత్రాలను పంపిణీ చేసింది. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని చెప్పే కార్యక్రమం ద్వారా డస్ట్ బిన్లను పంపిణీ చేసింది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. స్వర్ణాంధ్ర ప్రాంగణం నిత్యం ఎంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది.ఇంటింటికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు స్టిక్కర్లను అంటించడం ద్వారా ప్రజలకు వారి బాధ్యతను నిత్యం గుర్తు చేసేందుకు స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది. స్వర్ణాంధ్ర కుట్టు శిక్షణ విద్యార్థినుల చేత గుడ్డ సంచులు కుట్టించి వేలాదిగా ప్రజలకు, రైతు బజార్లో షాపుల వద్ద పంపిణీ చేసింది.స్వర్ణాంధ్ర సేవా సంస్థ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు గత రెండున్నర దశాబ్దాలుగా నిర్మాణాత్మక కృషి చేసినందుకు ఈ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల పట్ల స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర బాధ్యతగల స్వచ్ఛంద సంస్థగా మరింత ఉత్సాహంతో స్వచ్ఛ్ ఆంధ్ర కోసం పనిచేస్తామని రాంబాబు తెలిపారు.స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం పట్ల స్వర్ణాంధ్ర గౌరవ సలహాదారు సినీ హీరో సుమన్, అధ్యక్షులు రంకాని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సి పి రెడ్డి, వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి పలువురు నగర ప్రముఖులు రాంబాబుకు అభినందనలు తెలిపారు.

గత 27 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ సామాజిక సేవలు అందిస్తూ నగర ప్రజల, దాతల ఆదరాభిమానాలు పొందింది. స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ చేపట్టిన కార్యక్రమాలను స్వర్ణాంధ్ర ప్రజలకు చేరువ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డుకి ఎంపికైనట్లు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ ఆరవ తేదీన గుబ్బల రాంబాబు ఈ అవార్డును అందుకోనున్నారు.స్వర్ణాంధ్ర సేవా సంస్థకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని రాంబాబు తెలిపారు.1998లో ప్రారంభించబడిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగరాన్ని సుందర రాజమండ్రి గా మార్చడానికి దోమల నిర్మూలనకు ఇంటింటా లేవటరి గొట్టాలకు నెట్టలు కట్టింది. నగరంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్లడానికి వేలాది కరపత్రాలను పంపిణీ చేసింది. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని చెప్పే కార్యక్రమం ద్వారా డస్ట్ బిన్లను పంపిణీ చేసింది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. స్వర్ణాంధ్ర ప్రాంగణం నిత్యం ఎంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది.ఇంటింటికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు స్టిక్కర్లను అంటించడం ద్వారా ప్రజలకు వారి బాధ్యతను నిత్యం గుర్తు చేసేందుకు స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది. స్వర్ణాంధ్ర కుట్టు శిక్షణ విద్యార్థినుల చేత గుడ్డ సంచులు కుట్టించి వేలాదిగా ప్రజలకు, రైతు బజార్లో షాపుల వద్ద పంపిణీ చేసింది.స్వర్ణాంధ్ర సేవా సంస్థ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు గత రెండున్నర దశాబ్దాలుగా నిర్మాణాత్మక కృషి చేసినందుకు ఈ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల పట్ల స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర బాధ్యతగల స్వచ్ఛంద సంస్థగా మరింత ఉత్సాహంతో స్వచ్ఛ్ ఆంధ్ర కోసం పనిచేస్తామని రాంబాబు తెలిపారు.స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం పట్ల స్వర్ణాంధ్ర గౌరవ సలహాదారు సినీ హీరో సుమన్, అధ్యక్షులు రంకాని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సి పి రెడ్డి, వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి పలువురు నగర ప్రముఖులు రాంబాబుకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.