ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అయినవిల్లి మండలం బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన బుధవారం అయినవిల్లి మండలం కె.జగన్నాధాపురం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని ఆత్మ నిర్భర భారత్ సంకల్ప అభియాన్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రతీ ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప అభియాన్ లో గ్రామాలు పేదలు అన్నదాతలు మహిళలు మరియు యువత ద్వారానే స్వాలంబన భారత్ సిద్ధిస్తుందని అన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ‘ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ’ స్టిక్కర్లను అంటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సొసైటీ డైరెక్టర్ మిద్దే నూతన రవరాజ్, సీనియర్ నాయకులు మల్లాది మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


