జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు ప్రకారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్ ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.చెత్త, వ్యర్థాలను తొలగించి శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. గుణపం, పారలతో పిచ్చి మొక్కలు తొలగించి, చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. ప్రజలందరూ తమ ఇళ్ళు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు


