రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి సోమవారం గుండ్లురు రామయ్య స్వామి గారు ( ప్రధాన అర్చకులు ,పెంచలకోన దేవస్థానం ) అన్నదానానికి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులు సుమారు 500 మంది అన్నదానం చేయడం జరిగింది.ఈ ఆర్థిక సహయం చేసినందుకు వారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమం జరపడానికి మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు