భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఈవీ రమేశ్ గారి ఆధ్వర్యంలో “హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ”… బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ నందు మెమొరండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన వైఖరిని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని, యావత్తు ఖమ్మం జిల్లా ప్రజానికం బిజెపి వైపు చూస్తుందని రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టూ టౌన్ మండల బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ తో పాటు పలు మండల అధ్యక్షులు రాష్ట్ర,జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు తదితర పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.


