T.Ravinder
పున్నమి ప్రతినిధి ఖమ్మం :స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తన బలాన్ని నిరూపించి ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగరేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మండల జిల్లా నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి అధిపత్యం సాధించాలని కార్యకర్తలే పార్టీకి బలమని పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో గ్రామంలో బూత్ వారీగా కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు బిజెపి పోటీ చేస్తుందని ప్రకటించారు. .కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇవి రమేష్ కన్వీనర్ గా నిర్వహించిన ఈ సమావేశంలో బిజెపి నేతలు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం ,సన్నె ఉదయ ప్రతాప్ ,మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్ ,పుల్లారావు యాదవ్ ,డాక్టర్ శీలం పాపారావు ,నంబూరి రామలింగేశ్వర రావు, రేఖ సత్యనారాయణ యాదవ్, అల్లిక అంజయ్య యాదవ్ ,వీరవెల్లి రాజేష్ గుప్తా, వేల్పుల సుధాకర్ ,తొడుపునూరి రవీందర్ ,రుద్ర గాని మాధవ్, ,బోయినపల్లి సురేష్ ,బెనర్జీ ,మహేందర్ సింగ్ ,జ్యోతుల యుగంధర్, సుదర్శన్ మిశ్రా ,నల్లగట్టు ప్రవీణ్ కుమార్ ,ఇందూరి మహేష్ ,రవి రాథోడ్, దర్యాసింగ్ ,,కుంచం కృష్ణారావు ,ఆపతి రామారావు ,నరేష్ యాదవ్, మరియు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


