నెల్లూరులో ఈరోజు పేదల పెన్నిధిగా పేరుగాంచిన, బలగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప నాయకుడు గౌరవనీయులు శ్రీ బోమ్మీల బాల చెన్నయ్య గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించడం జరిగింది. నెల్లూరు నుండి ఢిల్లీ వరకు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా దాదాపు 52 సేవా సంక్షేమ అవార్డులు అందుకున్న ఆయన సామాజిక సేవకు నిదర్శనం. ఈ సందర్భంగా శాలువా కప్పి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఇలాంటి సేవా భావంతో మరెన్నో కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.


