శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడుగులు వేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం నాడు తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ను ఆయన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. తిరుపతిలో కొత్తగా బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు, అత్యవసర వైద్య సేవల అవసరమున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన తిరుపతి రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్, సెక్రటరీ ప్రతీత్, ట్రెజరర్ సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మణి శ్రీనివాస్, కృష్ణ కుమార్, సుధీర్, శివకుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గుణశేఖర్, రవి ఇతర ముఖ్య నేతలు, వైద్య సిబ్బంది ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

సేవా దృక్పథంతో ముందుకు సాగాలి-రెడ్ క్రాస్ కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి సత్య కుమార్.
శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడుగులు వేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం నాడు తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ను ఆయన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. తిరుపతిలో కొత్తగా బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు, అత్యవసర వైద్య సేవల అవసరమున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన తిరుపతి రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్, సెక్రటరీ ప్రతీత్, ట్రెజరర్ సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మణి శ్రీనివాస్, కృష్ణ కుమార్, సుధీర్, శివకుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గుణశేఖర్, రవి ఇతర ముఖ్య నేతలు, వైద్య సిబ్బంది ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

