ఆమడగూరు పున్నమి న్యూస్ సెప్టెంబర్ 29:
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సేవా తత్పరుడు యల్లంరాజును అమడగూరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో జర్నలిస్టులు ,పలు పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.యల్లంరాజు సన్మాన కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా యాల్లంరాజు జర్నలిస్టులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారాని ,గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. అమడగూరులో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జిల్లా స్థాయికి ఎదగడం హర్షించదగ్గ విషయం అన్నారు. మా ప్రాంత వాసి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం ఆమడగూరు మండలానికే గర్వకారణం అని తెలిపారు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడడం యల్లంరాజు నైజం అని పేర్కొన్నారు.యాల్లంరాజు
మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జర్నలిస్టులు, పలు పార్టీ నాయకులు ఆకాంక్షించారు. అనంతరం యాల్లంరాజు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జర్నలిస్టుగా రాణిస్తున్నానంటే కారణం అమడగూరు మండలమే అన్నారు. ఈ ప్రాంత పలు పార్టీల నాయకులు తోటి జర్నలిస్టుల సహకారంతో ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడానికి ముందు ఉంటానన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని ముఖ్యంగా అందరి సహకారంతో ఇంటి పట్టాలు లేని జర్నలిస్టులను గుర్తించి పట్టాతోపాటు ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చొరవ తీసుకుంటానని తెలుపుతూ ఇంత స్థాయిలో ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పురుషోత్తం రెడ్డి, గుండు వారి పల్లి సర్పంచ్ గోపిరెడ్డి, పాత్రికేయుల మండల సంఘం అధ్యక్షులు ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షులు శివరాం, కోటిరెడ్డి,లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ దొడ్డప్ప వార్డు మెంబర్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


