Tuesday, 24 March 2026
  • Home  
  • సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – భారత్‌లో నాలుగు నగరాల్లో క్లియర్ వ్యూ
- అన్నమయ్య

సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – భారత్‌లో నాలుగు నగరాల్లో క్లియర్ వ్యూ

2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సుమారు 82 నిమిషాలు కొనసాగే ఈ గ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం ప్రజలు వీక్షించగలరని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఇది స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో మాత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో క్లియర్ వ్యూ లభిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్లని పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణంగా కనిపించి, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత స్పష్టమైన చంద్రగ్రహణాల్లో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు.

2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సుమారు 82 నిమిషాలు కొనసాగే ఈ గ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం ప్రజలు వీక్షించగలరని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఇది స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో మాత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో క్లియర్ వ్యూ లభిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్లని పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణంగా కనిపించి, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత స్పష్టమైన చంద్రగ్రహణాల్లో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.