*సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి రైతుల పక్షాన వినతిపత్రం ను సమర్పించిన….*
*MRPS &BRS,కాంగ్రెస్ నాయకులు…*
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో… ఈ రోజు జిల్లా లో సీడ్ పత్తి రైతులు… *భారీ వర్షాల కారణం గా సరైన పంటలు దిగుబడి రకా,* సీడ్ ఆర్గనైజర్లు *పెట్టుబడి పైసలు ఇవ్వక పోవడం తో* బయట *అప్పులు తెచ్చుకొని* పెట్టుబడి పెట్టుకొన్నారు,… అలాగే ఈసారి *కూలీల రేట్లు కూడా చాలా దారుణం గా పెరిగి పోవడం తో…* రైతులు అప్పుల పాలు అయ్యారు…!!
*దీనికీ తోడు…ఆర్గనైజర్లు ప్యాకెట్ (పూత,పూత) కు ఈ సారి 450 మాత్రమే ఇస్తామని* కంపిణీ వారు చెపుతున్నారని,*చావు కబురు చల్లా గా చెపుతున్నారు,* ఇలా అయితే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది,*కాబట్టి ఈ సారి కూడా గత సంవత్సరం మాదిరిగానే….ప్యాకెట్ కు 550 రూపాయలు ఇచ్చే విదంగా..* తగు చర్యలు తీసుకొని, మరియు *రైతుల కు ఇవ్వాల్సిన పంటల పైసలు ఎప్పటి లాగానే జులై నెల లో ఇచ్చే లా* ఆదేశాలు ఇచ్చి రైతుల కు న్యాయం చెయ్యాలని,రైతులతో కలిసి వినతిపత్రానందించారు…
ఈ కార్యక్రమం లో…. *BRS నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, MRPS నాయకులు ఐజ రాజు మాదిగ*,
*BRSV నాయకులు కుర్వ పల్లయ్య, MRPS నాయకులు బలీగేరి ఏసన్న మాదిగ, కాంగ్రెస్ నాయకులు బింగిదొడ్డి నాగేష్, చిన్న యాదవ్, మేడికొండ రామకృష్ణ*, తదితరులు పాల్గొన్నారు.


