రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి
సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డు BRS పార్టీ అభ్యర్థి అడిచేర్ల రూప సాయికృష్ణ గారి తరఫున ఈరోజు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. BRS పార్టీ సీనియర్ నాయకులు, ఇంచార్జ్ అక్కరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది.
ప్రచారం సందర్భంగా నాయకులు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థి రూప సాయికృష్ణ గారికి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్, ఆవునూర్ గ్రామ BRS పార్టీ నాయకులు బైరి శ్రీనివాస్ గౌడ్, కనమెని శ్రీనివాస్ రెడ్డి, నేరళ్ళ స్వామి, నక్క దాసరి దేవరాజ్, మంత్రి బాబు, నక్కల రాంరెడ్డి, MD నజీర్, శ్యాగ ఎల్లయ్య, తాలూకా దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు.


